మన్యం టివీ, దుమ్ముగూడెం::
మండలంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్నటువంటి బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైనటువంటి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా మంజూరైనటువంటి చెక్కులను జెడ్పిటిసి తెల్లం సీతమ్మ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో వైద్యం చేపించుకుని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు సహాయం అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు పార్టీ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనితిరాముడు ఎంపీటీసీ తిరుపతిరావు పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీకాంత్ పార్టీ నాయకులు కొత్త మల్లేష్ కెల్లశేఖర్ కొత్తూరు సీతారామారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: