మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ గ్రామంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా రావాలని జమ్మిగూడెం గ్రామ ప్రజలు అశ్వరావుపేట నియోజక వర్గ ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావు ని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా జమ్మిగూడెం గ్రామంలో నిర్వహించబడుతున్న బతుకమ్మ సంబరాలకు తప్పకుండా విచ్చేస్తానని ఆ గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ వేడుకులు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ వేడుకలు తగు జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మిగూడెం గ్రామపంచాయతీ వార్డు మెంబర్ దానపు జగపతి మరియు మహిళలు రెడ్డి లక్ష్మి, గణప పుల్లమ్మ, ధనలక్ష్మి, దానపు లక్ష్మి, పాపమ్మ, యువకులు దాది చంటి, చింటూ, రావుల నాగయ్య, గణప నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: