మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రుణాలు తీసుకున్న రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం నాడు సూచించారు . ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలను ఆయన రైతులకు చెక్కులను అందజేశారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికే సహకార సంఘాలు ఉన్నాయని, అన్నారు. అట్టి రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ ముదునూరి రవి శేఖర్ వర్మ, ఎంపీపీ గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: