జూలూరుపాడు సెప్టెంబర్ 22, (మన్యం మనుగడ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని జూలూరుపాడు గ్రామపంచాయతీ చౌక దుకాణాన్ని సీజ్ చేస్తున్నట్లు స్థానిక రెవిన్యూ శాఖ అధికారులు తెలిపారు. వివరాలలోకి వెళితే చౌక దుకాణాన్ని తెరవడం లేదంటూ, రేషన్ బియ్యం సరిగా పంపిణీ చేయడం లేదంటూ, ఎలాంటి సమాచారం ప్రజలకు ఇవ్వడం లేదంటూ స్థానిక గ్రామ ప్రజలు గురువారం షాపు ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక రెవిన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని షాపు లోపల పరిశీలించగా బియ్యం స్టాక్ లేకపోవడంతో అవాక్కయ్యారు. అధికారులు సంబంధిత షాపు డీలర్ ను బియ్యం స్టాక్ పై వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో షాపును సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. స్టాక్ రికార్డులను పరిశీలించి సంబంధిత షాప్ డీలర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవిన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఆందోళన విరమించారు
Navigation
Post A Comment: