CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండలంలో పలు కుటుంబాలకు రేగా పరామర్శ

Share it:


మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్  తమ్ముడు శేషుబాబు (53) సంవత్సరాలు ఇటీవల  గుండెపోటుతో మరణించడంతో వారి దశదినకర్మలకు హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు పరామర్శించారు. 

 జానంపేట గ్రామంనకు చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాటిబండ్ల సత్యనారయణ ఇటీవల  కాలు శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జానంపేట గ్రామపంచాయతీ భూపతిరావుపేట గ్రామానికి చెందిన దుగ్గిరాల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి దశదినకర్మలకు హాజరై మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాలలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: