- సీఎం కేసీఆర్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం.
- పోడు సాగు దారుల జీవితాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్:ఎంపీపీ రేగా కాళికా
- పోడు భూములకు శాశ్వత పరిష్కారానికై జీవో నెంబర్ 140 విడుదల చేసిన ప్రభుత్వం
మన్యం మనుగడ కరకగూడెం: పోడు భూముల పట్టాలు పంపిన సాధనకై శాశ్వత పరిష్కారం చూపేందుకు జీవో 140 విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చిత్రపటాలకు మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ రేగా కాళికా,ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం రాజబాబు మాట్లాడుతూ మా భూములు మాకు దక్కుతాయో లేదో అనే సందిగ్ధంలో ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు శాశ్వత పరిష్కారానికై జీవో నెంబర్ 140 ను విడుదల చేయడం పట్ల గిరిజన పోడు సాగుదారుల కళ్ళల్లో ఆనందం చూడడం జరిగిందన్నారు. పోడు సాగుదారులు కళ్ళల్లో ఆనందం చూడడానికి గల కారకులు సీఎం కేసీఆర్ అన్నారు. జీవో నెంబర్ 140 ను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కి కొనసాగుదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు పాయం.నరసింహారావు, కొమరం.విశ్వనాథం, పోలెబోయిన.పాపమ్మ,భూక్య భాగ్యలక్ష్మి,పోలెబోయిన. నరసింహారావు,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, నాయకులు రేగా సత్యనారాయణ,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,బైరిశెట్టి.చిరంజీవి.కల్తి. నరేష్,బుడగం రాము,కొంపెల్లి పెదరామలింగం,మాజీ సర్పంచ్ పోలెబోయిన.వెంకటేశ్వర్లు,టి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: