CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత...

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి , చండ్రుగొండ: వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీ శాఖ రేంజర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చిరుతకు, చిరుత పులికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయని, వాటిని సంరక్షించుకోవాలని, చిరుత అంతరించడం వల్లనే కోతులు బెడద పెరిగిందన్నారు. చిరుతకు మంచి ఆహారం కోతి , అటువంటి చిరుతలను చంపి వేయడం వల్ల  కోతుల సంఖ్య క్రమంగా పెరిగి, ఇప్పుడు సమస్యగా మారిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చిరుతలను పెంచే ఆలోచన చేస్తుందని, ఇతర దేశాల నుండి చిరుతలను తీసుకురావాడని నిర్ణయించడం మంచి శుభపరిణామన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు మంజుశ్రీ, రాములు, నరసింహారావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: