మన్యం మనుగడ, వాజేడు, సెప్టెంబర్ 13.: ఆదివాసుల సంస్కృతి, ఆచార, సాంప్రదాయాలు, ప్రకృతికి అనుబంధంగానే జరుపుకునే పండగ కొత్తల (పెద్దల) పండుగ. సెప్టెంబర్ మాసంలో ఉత్తర కార్తి మొదటి పాదంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈనెల 14 ,15 ,బుధ, గురు వారాలలో ఆదివాసీలు ఆచార సాంప్రదాయాలు సాంస్కృతులతో పండుగను జరుపుకుంటారు. ఆదివాసీలు పవిత్రంగా జరుపుకునే కొత్తల (పెద్దల) పండుగకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవ పరిచే విధంగా 14, 15 తేదీలలో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించ వలసిందిగా, వాజేడు మండల ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, సర్పంచ్ల పోరం అధ్యక్షులు పూసం నరేష్ కుమార్, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాజేడు ఎంఈఓ ధారావత్ వెంకటేశ్వరరావు,కి తహసిల్దార్, ఎంపీడీవో,కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాయం జానకి రమణ, సిద్దబోయిన సర్వేశ్వరరావు,తల్లడి నాని బాబు, బోదే బోయిన మోహన్ రావు. తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: