మన్యం టివి, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం తో మణుగూరు మండలానికి చెందిన బోయిళ్ల రాజు,కోదాది శివ కేశవుల కు దళిత బంధు నిధులతో మంజూరైన యూనిట్లను శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, లబ్ధిదారులతో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, ఆర్థికంగా అభివృద్ధిలో ఎంత వెనుకబడిన దళితులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ అధ్వరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేలా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.మొదటి విడత లో నియోజకవర్గం కు 100 మంది చొప్పున ప్రతి దళిత కుటుంబానికి రూ 10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిధులు అందజేస్తున్నట్లు అని తెలిపారు.ఇది ఎంతో అద్భుతమైన పథకమని ఇటువంటి పథకం గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.ఇంత గొప్పగా విజయవంతం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం. నర్సింహారావు,పిఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్,మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు కార్యదర్శులు నవీన్,రామిరెడ్డి,మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్, యువజన నాయకులు రవి ప్రసాద్,హర్ష నాయుడు,గుర్రం సృజన్,రాహుల్ గౌడ్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: