మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాకవి ఉద్యమకారులు కాళోజి నారాయణరావు 108వ జయంతి వేడుకలను తెరాస పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, అశ్వరావుపేట టౌన్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, పేరాయి గూడెం గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ బజారయ్య, అశ్వరావుపేట యువజన నాయకులు కలపాల శ్రీనివాసరావు, తగరం హరి, గంధం ఆనంద్, ఆవుల చిన్ని, బి ప్రసాదు, వార్డు సభ్యులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిహెచ్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: