మన్యం మనుగడ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట పట్టణంలో ప్రయాణికులకు బస్టాండ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అదేంటి బస్టాండ్ ఉంది కదా అంటే వుంది కానీ అది లారీలకు అడ్డగా మారింది. ఈ బస్టాండ్ గురించి పట్టించుకునే నాధుడే లేడు. బస్టాండ్ చుట్టూ చెట్లతో పొదలతో బురద కుంటలతో పందులుకు నిలయంగా మారింది. మరి కొంత భాగం ప్రవేటు వాహనాలు లారీలు, ఆటోలు నిలుపుకొని ఉండడానికి అడ్డాగా మారింది. ఈ విదంగా వున్నా బస్టాండ్ లో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్న ప్రయాణికులు. గతంలో కొంతమంది ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి ఎలా ఉందో చూసి వెళ్లిపోయారు దీని గురించి ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోలేదు, ప్రయాణికులు ప్రయాణం చేయాలంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మందలపల్లి వెళ్లి బస్సులు ఎక్కుతున్నారు. అక్కడి వరకు వెళ్లడానికి ఆటో మీద వెళ్ళాలి లేదా సొంత వాహనం ఉండాలి, ఆటో కి వెళ్లాలంటే ఆటో వాళ్ళు అడిగినంత ఇస్తూ సామాన్యులు తప్పదని ఇస్తూ నష్టపోతున్నారు. దీని గురించి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: