CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరి ముంపు బాధితులకి అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం: జెడ్పీటీసీ పోశం. నర్సింహారావు

Share it:


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గోదావరి ముంపు వలన సర్వం కోల్పోయిన బాధితులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని,వారి సమస్యల పరిష్కారంలో కీలకమైన పాత్ర పోషించిందని, స్థానిక జడ్పిటిసి పోశం. నరసింహారావు అన్నారు. గోదావరి ముంపు బాధితులకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సౌజన్యంతో అందించిన 10 కేజీల బియ్యం, కందిపప్పు,గోధుమపిండి,మంచి నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు,మొదలగు నిత్యవసర వస్తువులను శనివారం నాడు మణుగూరు మున్సిపాలిటీలోని కమలాపురం,రాయి గూడెం, అన్నారం కాలనీ గ్రామాల్లో పంపిణీ చేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బాధితులని ఆదుకోవడంలో అండగా నిలవడంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే  రేగా కాంతారావు ప్రధాన పాత్ర పోషించి,వారికి అండగా నిలిచారని ఆయన అన్నారు. ముంపు బాధితుల సమస్యల ను స్వయంగా పరిశీలించిన రేగా కాంతారావు,స్పందించి అనేక మంది దాతల సహకారాన్ని తీసుకొని,ముంపు బాధితులకి మనోధైర్యాన్ని కల్పించిన ఘనత రేగకే దక్కిందన్నారు.ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ పోశం. నర్సింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా. అప్పారావు,ప్రధాన కార్యదర్శిలు రామిడి రామిరెడ్డి, బొలిశెట్టి నవీన్,టిఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ఆవుల నరసింహారావు,ముద్దాంగుల కృష్ణ, యువజన కార్యదర్శి బోశెట్టి రవి,రామస్వామి, వెంకట్ రెడ్డి,తుంగలి చంద్రకళ, సరస్వతి,తెల్లం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: