మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలోని ఐసీడిసీ కార్యాలయం నందు శనివారం అశ్వారావుపేట సిడిపిఓ రోజారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు పేద పిల్లల ఎదుగుదలకు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం పౌష్ఠిక ఆహారం అందించటానికి ఎన్నో రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చారని, అందులో భాగంగా చిరు ధాన్యాలు ఆర్గానిక్ ఆహార పదార్థాలు పాలు, గుడ్లు అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ ఒక్క ఐసీడిసీ ద్వారా అంగన్వాడీ టీచర్స్ ద్వారా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకు పౌష్ఠిక ఆహారం అందించటానికి పోషణ లోపం నిర్మూలనకు ఇంటింటికి తిరిగి చాలా కష్ట పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు పిడి వరలక్ష్మి, సీడిపిఓ రోజారాణి, దమ్మపేట సీడీపీఓ, సూపర్ వైజర్స్ విజయలక్ష్మీ, సౌజన్య, పద్మావతి, సర్పంచ్ లు అట్టం రమ్య, నార్లపాటి సుమతీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: