మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆసరా పింఛన్లు అర్హులందరికీ వచ్చేలా చూస్తామని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ... కరెంట్ సరఫరాలో నిత్యం తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సభ్యులు ఎంపీపీ దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించారు.విద్యుత్ శాఖ అధికారులు తీరుతో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ఇకపై కరెంటుతో రైతులు ఇబ్బంది పడితే అధికారులపై చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఆర్ అండ్ బి అధికారుల అలసత్వం వల్ల ఐదేళ్లుగా లంకలవాగు బ్రిడ్జి అసంపూర్తిగా నిలిచిపోయిందని అధికారుల పనితీరులో మార్పు రావాలన్నారు. అనంతరం మండల స్థాయి అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలను సభకు సమర్పించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో అన్నపూర్ణ, జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి,వైసీపీ నరుకుళ్ళ సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: