మన్యం మనుగడ, మంగపేట: ఢిల్లీ లో ఆల్ ఇండియా రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘాలు రాకేష్ టికాయత్,వెంకట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా తులకుదొర ఆడిటోరియం లో 28 రాష్ట్రాల ప్రతినిధులతో ఈనెల 5న జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సుకు ములుగు జిల్లా మంగపేట మండలం నుండి ముత్యాలు ఎంపిక కావడం జరిగింది.ఈ సదస్సుకు తనను ఎంపిక చేయడం పట్ల ఎల్పీ ముత్యాలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఎల్పీ ముత్యాలు మాట్లాడుతూ ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతం నుంచి తమను ఎంపిక చేసినందుకు ఆలిండియా కిసాన్ సభ నాయకులు రాకేష్ టికాయత్ కు,ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ కు ధన్యవాదాలు తెలియజేశారు.,ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంపై రైతులు పడుతున్న సంక్షోభంపై ,కార్మికుల అవస్థలపై,రైతు వ్యతిరేక చట్టాలైన లేబర్ కోడ్ బిల్లుపై, రైతుల పక్షాన,కార్మికుల పక్షాన,ఉపాధి హామీ పథకం పూర్తి స్థాయిలో అమలుకై,రైతుల అప్పులు,ఆత్మహత్య లపై మరియు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించుటకై,ఢిల్లీలో జరుగుతున్న సదస్సు లో చర్చిస్తానని, పలు డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచే దాంట్లో మంగపేట ప్రాంతం నుంచి అవకాశం నాకు ఇచ్చినందున ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రజలకు గొంతుగా ఢిల్లీలో మాట్లాడుతా అని అన్నారు.రైతులు,కార్మికుల సమస్యలపై,కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ఎల్పీ ముత్యాలు ను ఎంపిక పట్ల వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ,,మాజీ ఆత్మ చైర్మన్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,పూజారి సురేందర్ బాబుకాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బండ జగన్మోహన్ రెడ్డి,తెరాస పార్టీ నాయకులు ఎస్కె అన్వర్ తెరాస మహిళా నాయకురాలు కాటూరి సుగుణ,మాజీ రామకృష్ణ ,సొసైటీ డైరక్టర్ నర్రా శ్రీధర్ ,ఎల్పీ రవి,,సాంబశివరావు,బి ఎస్పీ ములుగు అసెంబ్లీ ఇంచార్జీ ఎంపెళ్లి వీరస్వామి,బి ఎస్పీ ములుగు అసెంబ్లీ ఇంచార్జీ మంద సతిష్ ,బీఎస్పీ మండల కన్వీనర్ బేత వెంకటేష్ ,నైనారపు కేశవులు,సిపిఎం పార్టీ మండల కన్వీనర్ జాగటి చిన్నా,ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి తోకల రవి,నారా దిలీప్ ,జ్వాల యూత్ అధ్యక్షుడు కోడెల నరేష్,,రావుల రమణయ్య,చక్రపాణి,మూగల రమేష్,ఎమ్మార్పిఎస్ మంగపేట మండల ఇంచార్జీ గుగ్గిల సురేష్ ,పాగా బాబు,ఎంపెళ్లి సమ్మక్క ,కౌసల్య,నాగార్జున ,సమ్మయ్య,మంగపేట మండల కేంద్రంలో ఆయనను కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Navigation
Post A Comment: