మన్యం మనగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పాండురంగాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు హిందీ దివస్ వేడుకలను జరుపుకున్నారు. హిందీ ఉపాధ్యాయురాలు చాంద్ బేగం ను తోటి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఆమె పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ ను బహూకరించారు. విద్యార్థులతో హిందీ భాష అభివృద్ధి కోసం సేవ చేసిన కవులు, రచయితల వేషధారణ వేయించి, పలువురి చేత అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగాపురం సర్పంచ్ ఈసంభవతి, పాఠశాల ఉపాధ్యాయుల బృందం, అంగన్వాడీ కార్యకర్త, సి ఆర్ పి దుబ్బ ముఖేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: