మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: తమ వీధుల్లో మూత్రం పోస్తున్నారంటూ ఆ వీధికి చెందిన యువకులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... మండల కేంద్రంలో ప్రధాన సెంటర్ దగ్గర గల ఎస్సీ బాలుల వసతి గృహానికి వెళ్లే దారికి ఇరువైపులా నిత్యం వందలాదిమంది మూత్రం పోస్తుండడం వల్ల దుర్వాసన వస్తుందని, మహిళలు వీధుల్లో వారు వస్తూపోతూ ఉన్న పట్టించుకోకుండా మూత్ర విసర్జన, చేస్తున్నారని దీని వల్ల మా ఆత్మగౌరవం దెబ్బతింటుందని, అనారోగ్య సమస్యల సైతం తలెత్తుతున్నాయని యువకులు ఆరోపించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎస్సై విజయలక్ష్మి, సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో మరకాల రవీందర్ రెడ్డి, యువకులు ఉన్నారు.
Navigation
Post A Comment: