ములకలపల్లి , మన్యం మనుగడ ప్రతినిధి: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండలంలో విస్తృత పర్యటనచేశారు.పర్యటనలో భాగంగా మండల కేంద్రం లొ బీసీ సెల్ శ్రీరాముల నాగేశ్వరరావు సోదరుడు ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వెలుగు విలేఖరి పువ్వాళ్ల శ్రీనువాస్ తండ్రి చనిపోగా వారి కుటుంబాన్ని,ఒడ్డుగుడెం గ్రామం మడకం చిరుమప్ప అమ్మ మడకం గొప్పమ్మ కుటుంబాన్ని, సీతాయిగూడెం పంచాయితీ గండిప్రోళ్ళు గ్రామం మాజీ ఎంపీపీ కుర్సం శాంతమ్మ భర్త చనిపోగా వారి కుటుంబాన్ని, జగన్నాథపురంలో నూకల శివారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. దివికేగిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని చిత్రపటానికి పూలు వేసి నివాళ్లర్పించారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ములకలపల్లి మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి,నాగళ్ల వెంకటేశ్వరావు, ములకలపల్లి ఎంపీపీ నాగమణి, అన్నపరెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత ప్రసాద్, ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి,మాజీ ఎంపీపీ కేసరి లక్ష్మణరావు,సీనియర్ నాయకులు మేకల వెంకన్న, శనగపటి రవి, శనగపటి అంజి, శనగపతి సీతారాములు, శనగపటి మేహర, ఎంపీటీసీ సున్నం సునీత, టీఆర్ఎస్ వీ మండల అధ్యక్షుడు గుంటూరు కృష్ణ, పొన్నూరు హరి, దుగ్గి సంపత్, గుంటురు సాయి, వేములి రోశయ్య, దేవాల బిస్కం,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: