అన్నపురెడ్డిపల్లి(ములకలపల్లి), మన్యం మనుగడ ప్రతినిధి: మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల లో డాక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండాపాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా హెచ్ ఎస్ బి, నాగేశ్వరరావు మాట్లాడుతూ, పాఠశాల చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, మురుగునీటి నిలువ వల్ల డెంగ్యూ , మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగ
తగు జాగ్రత్తలు పాటించాలని,జ్వరం, దగ్గు,జలుబు ఉన్నవారిని గుర్తించి రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ ఆధారంగా వారికి కావలసిన మందులు అందజేశారు. అనంతరం కేజీబీవీ ఎస్ ఓ కవిత మాట్లాడుతూ,పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించినందుకు డాక్టర్ ప్రియాంక వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వై కోటేశ్వరరావు, రాందాస్, ఏఎన్ఎం కె జయలక్ష్మి ,నాగజ్యోతి, కేజీబీవీ పాఠశాల ఏఎన్ఎం కె ఈశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు,ఆశ కార్యకర్తలు అనురాధ, బేబీతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: