మన్యం టీవీ , దుమ్ముగూడెం :: ఏజెన్సీ మారుమూల మానుగట్ట గ్రామంలో దుమ్ముగూడెం పోలీస్ శాఖ పర్ణశాల వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. గుత్తికోయ గ్రామ ప్రజలకు డాక్టర్ బాలాజీ నాయక్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశానుసారం హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి సంక్షేమ జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ తెలియజేశారు అలానే తమ గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలియజేశారు అనంతరం గ్రామస్తులకు పిల్లలకు బిస్కెట్లు బ్రెడ్ స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎస్సై రవికుమార్, కేశవ్ పర్ణశాల వైద్య సిబ్బంది పోలీస్ శాఖ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: