మన్యం మనుగడ, మంగపేట:
మంగపే
ట మండలంలోని బోర్ నర్సాపురం గ్రామంలో ఇటీవల ఎల్లం దాసరి నర్సయ్య (ఎర్రయ్య ) అనే వ్యక్తి రోడ్డు మీద పడి ప్రమాదవశత్తు తలకు తీవ్రగాయం అయి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించి ఆ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారికి తక్షణమే ఆర్థిక సహాయం అందజేశారు. తదనంతరం ఇదే గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇంచార్జీ గుడివాడ శ్రీహరికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంగపేట మండలం కొత్తచీపురుదిబ్బ గ్రామానికి చెందిన కోరం ముత్తమ్మ తీవ్రమైన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ కలిసి పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాడిశ నవీన్, కొమరం నితిన్,బాడిశ ఆది, ఇందారపు రమేష్, గట్టిపల్లి అర్జున్, చౌలం బాబు, బొడ ప్రవీణ్,మునిగల మహేష్, కనుకుంట్ల నాగరాజు , కర్రీ చందు గ్రామస్తులు మాజీ ఎంపిటిసి మూగల జ్యోతి రమేష్, రావుల రమణ, గుంటక నాగేశ్వరరావు, మూగల రాము,చౌలం భాస్కర్,చౌలం శ్రీను, పూణెం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: