జూలూరుపాడు, సెప్టెంబర్ 26, (మన్యం మనుగడ ప్రతినిధి) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక మహిళ తనదైన శైలిలో ఫోరు నడిపి చరిత్ర పుటల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పోరాట యోదరాలు, "వీరవనిత" చాకలి ఐలమ్మ 127వ, జయంతి వేడుకలను సోమవారం జూలూరుపాడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ఆదేశానుసారం, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, టిఆర్ఎస్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, వెంగన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి, రామ్ శెట్టి నాగేశ్వరావు, పాతర్లపాటి రామయ్య, ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్, వేల్పుల నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: