CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశాన్ని కార్పోరేట్ శక్తులకు బిజెపి ప్రభుత్వం దోచిపెడుతుంది : న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు

Share it:

 



గుండాల సెప్టెంబర్ 27(మన్యం మనుగడ) కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని కార్పోరేట్ శక్తులకు ధారాధం చేస్తుందని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునూరి మధు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 14వ తారీకు అడవి సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ భారీ సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బిజెపి నాయకులు చెప్పేవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలేనని ప్రజలను వంచించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అడవి రక్షణ నియమాలతో దేశం లో ఉన్న 40 లక్షల మంది ప్రజలు నిర్వాసితుల అవతారన్నారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముక్తి సత్యం, వాగబోయిన రామక్క, కోరం సీతారాములు, అరేం నరేష్ , పరిషిక రవి, ప్రసాద్, యాసారపు వెంకన్న, ఎస్కే అజ్గర్, బత్తిని సత్యం, బచ్చల సారన్న, ఈసం కృష్ణ , మానాల ఉపేందర్, పిడిఎస్యు నాయకులు ఇర్ఫ రాజేష్ తదితరులు పాల్గొన్నారు


Share it:

TELANGANA

Post A Comment: