గుండాల సెప్టెంబర్ 27(మన్యం మనుగడ) సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలం పనులు చేసుకునే రైతులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ ప్రజలకు సూచించారు. సోమవారం ఇల్లందు మండలంలో పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి మరణించారని స్థానిక గురుకుల పాఠశాల వద్ద ఉన్న వాక్కుడు అజయ్ ఇంటిపై కూడా పిడుగు పడిందన్నారు. ప్రజలు పనులు చేసుకునేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు వర్షం వచ్చినట్లయితే చెట్ల కింద ఉండవద్దని ఆయన సూచించారు
Post A Comment: