మన్యం టీవీ దుమ్ముగూడెం ::
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీ నగరం పార్టీ కార్యాలయంలో తాటిపూడి రమేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా సమితి సభ్యులు నోముల రామ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ ఈనెల 4,5,6,7, తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే సిపిఐ రాష్ట్ర మూడవ భారీ బహిరంగమహాసభలకు సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలి రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని శంషాబాద్ లో జరిగే బహిరంగ సభ ప్రజాపోరాటాలకు దిక్సూచిగా ఉంటుందని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బొందల రాంబాబు మామిడి రాజు పంపన అప్పలరాజు తురం రాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: