మన్యం మనుగడ ప్రతినిధి , చండ్రుగొండ: భూమి కోసం, భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని రైతుసంఘం మండల అధ్యక్షులు పెద్దిని వేణు అన్నారు. శనివారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు రామఅడుగు వెంకటాచారి అధ్యక్షతన చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేణు మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితో అవినీతిపై పోరాటం కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూలి రేట్లు పెంపు కోసం, రైతులకు పంటల మద్దతు ధర కోసం ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం, మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శి చల్లపల్లి రాజ, రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు సిరికొండ రాములు, ప్రధాన కార్యదర్శి పావురాల నాగులు, సహాయ కార్యదర్శులు సిరికొండ వీరభద్రం, మురళి, ముత్యం, వర్తక సంఘం సభ్యులు వనమా వెంకటేశ్వరరావు, ఆటో యూనియన్ నాయకులు జి సత్యం, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: