- ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి చట్టాలను రక్షించుకుందాం! సంఘీభావం తెలిపిన ఏ. టి.ఎఫ్
- హక్కుల అమలుకు ఉద్యమించాలన్న ... కురసం రామారావు
- ఆదివాసీలను వంచన చేస్తున్న పాలకులు
మన్యం మనుగడ, వాజేడు, సెప్టెంబర్ 10 , నూగూరు వెంకటాపురం: రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్డ్ లో చెప్పబడిన విధంగా విధంగా ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని ఏ.టి.ఎఫ్. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కురసం రామారావు పేర్కొన్నారు. ఏ.ఎన్.ఎస్.చేస్తున్న దీక్షలు శనివారం నాటికి 19 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన రామరావు పై విధంగా స్పందించారు. ఆదివాసీ చట్టాలను అమలు చేయకపోవడం కారణంగానే ఆదివాసీలు విద్యా, ఉద్యోగాల్లో వెనకబడి పోతున్నారని అన్నారు. పాలక ప్రభుత్వాలు చిత్త శుద్ధి తో జీవో 3 ని చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచి నర్సింహమూర్తి మాట్లాడుతూ స్వాతంత్రం సిద్దించి 75 పూర్తి అయినా కూడా ఆదివాసీలు తమ హక్కుల అమలు కోసం ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. పాలక ప్రభుత్వాలు ఆదివాసీలను వంచన చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ చట్టాలను అమలు చేయకపోతే ఆదివాసీ రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంత స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయ బానిసత్వం కారణంగానే అధికారులు చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. 19 రోజుల నుండి ఆదివాసీ మహిళలు చట్టాలు అమలు చేయాలని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దీక్షలు చేస్తుంటే ఏ ఒక్క స్థానిక ప్రజా ప్రతినిధి లో చలనం లేదన్నారు. ఏ.ఎన్.ఎస్.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,న్యాయవాది వాసం నాగరాజు ,భార్గవ్, సుభద్ర, భవాని, రాజేష్, ఏ.టి.ఎఫ్ రాష్ర్ట ప్రచార కార్యదర్శి సపక నాగరాజు, బోదెబోయిన జయబాబు, జైరాం, జానకి రావు, తాటి నర్సింహారావు, రమేష్, మహేష్, కురసం విజయ్, ఒంటిమామిడి, చిరుతపల్లి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: