మన్యం మనగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం గ్రామ సమీపానగల పెద్దవాగులో ఇసుక ర్యాంపు అనుమతులు లేకుండానే రాత్రికి రాత్రి భారీ వాహనాల సహాయంతో ఇసుకను ఒడ్డుకు చేర్చి, లారీల ద్వారా తరలిస్తున్నారు. వాగులో ఇసుక తీయడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ ఇసుక దొంగలు రాత్రికి రాత్రే వాహనాల ద్వారా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో గోవిందాపురం గ్రామ రైతులు వారి పాసుపుస్తకాలతో ప్రభుత్వం నుండి ఇసుక క్వారీలకు అనుమతులు పొంది, ఇసుకను తరలించారు. వర్షాకాలం ప్రారంభం అయ్యి పెద్దవాగుకు వరదలు రావడంతో ఇసుక మేటలు వేసింది.ఇదే అదునుగా భావించిన ఇసుక దొంగలు, వెళ్లే దారిని సరిచేసుకొని, ఇసుకను రాత్రివేళ తరలిస్తున్నారు. గ్రామస్తులు ఈ విషయంపై అడగగా, పాత అనుమతులు పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని, దొంగ మాటలు చెబుతున్నారని గోవిందాపురం ప్రజలు తెలియజేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి, పగలు రాజుల లాగా రాత్రి దొంగలుగా మారే ఇసుకాసురుల భరతం పట్టాలని కోరుతున్నారు.
Navigation
Post A Comment: