- దళితుల కుటుంబాలలో వెలుగులను నింపిన దళిత బంధు పథకం.
- దళిత బంధువు ద్వారా మంజూరైన షాపులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా.కాంతారావు
మన్యం మనుగడ , కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత పథకం ద్వారా మంజూరైన షాపులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ తినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు మండలంలోని శ్రీరంగాపురం,అనంతారం, కరకగూడెం గ్రామాలలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన షాపులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం దళితులు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడంతో పాటు ఐక్యతకు నిదర్శనంగా మారిందని ఆయన పేర్కొన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అవి ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దళితుల జీవితాలలో వెలుగులు నింపి ఎటువంటి కూచికతో తిరిగి చెల్లించిన అవసరం లేకుండా నేరుగా దళితులకు 10 లక్షల రూపాయలు అందించే గొప్ప పథకం దళిత బంధు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీపీ రేగా కాళికా ప్రజాప్రతినిధులు,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బారి ఎత్తున పాల్గొన్నారు.
Post A Comment: