మన్యం మనుగడ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న రెండు పరీక్ష కేంద్రాలను ఎస్ హెచ్ఓ గొంది. వెంకటేశ్వర్లు జిల్లా సహాయ మలేరియా అధికారి లింగ్యానాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రెండు రక్త పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని తనికిలో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని డీఎంహెచ్ఓ,డాక్టర్ శ్రీనివాస్ మణుగూరు ఇంచార్జి తనిఖీ అధికారి ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో మూసి వేయడం జరుగుతుందని వారు తెలిపారు.నిబంధనలు పాటించకుండా ఎవరైనా రక్త పరీక్ష కేంద్రాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Navigation
Post A Comment: