మన్యం టీవీ చర్ల :
చర్ల మండలం లో ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి 13వ వర్ధంతి పురస్కరించుకొని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లపు దుర్గాప్రసాద్ ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పథకాలను పేదలకు వరంగా అందజేసిన గొప్ప మహనీయులు, పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి 108 పథకం ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించిన మహానుభావుడని, ఎంతోమంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని అందించే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోడానికి ఫీజు రీఎంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలు అందజేసి తెలుగు ప్రజల మదిలో చిరస్మరణీయుడిగా మిగిలారని కొనియాడారు. అనంతరం రాజశేఖరుని వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు విజయ నాయుడు వితరణతో ఏర్పాటుచేసిన నాలుగు వందల నోట్ బుక్స్, పెన్నులు మండల పరిధిలోని చిన్న మిడిసిలెరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల 200 మంది విద్యార్థులకు నల్లపు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీద కోదండరామయ్య, ఎంపీటీసీ మడకం పద్మజ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, గూడపాటి సతీష్, సుందరి సురేష్, అలవాల బాలు, మాజీ ఎంపీటీసీ సీత, ఉప్పరగూడెం సర్పంచ్ యలకం నరేంద్ర, శ్రీను, మడకం రాము, కారంపూడి సాల్మన్, చింతూరి రజినీకాంత్, రంగు వెంకటేశ్వర్లు, పలువురు వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: