మన్యం మనుగడ, మంగపేట.
తేది. 04.09.2022 న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగపేట గ్రామాల్లో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా, తెలంగాణ వారి ఆధ్వర్యంలో, శ్రీ సత్యసాయి మొబైల్ సేవలు - తెలంగాణ వారి సౌజన్యంతో ఏర్పాట్లు చేయుచున్నట్లు తెలియ జేశారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలకి ల్యాబ్ ద్వారా డాక్టర్లు సూచించిన వారికి అన్నిరకాల రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు చేయడం జరుగుతుందని, కంటి సమస్యలు, అర్థో- కీళ్ళ సమస్యలు, మహిళల సమస్యలు, పిల్లల సమస్యలు మరియు బిపి, షుగర్ సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన అందరికీ మందులు ఇవ్వనున్నట్లు ఈ సదుపాాన్ని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలియ జేశారు.
Post A Comment: