గుండాల సెప్టెంబర్ 3(మన్యం మనుగడ) అతి పెద్ద భారతీయ బీమా సంస్థ ఎల్ఐసి ఏజెంట్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని భీమ సమైక్య ఏజెంట్ల ఇల్లందు శాఖ లియాఫీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇల్లందు కార్యాలయం ముందు ఉదయం పదిగంటల నుండి ఒంటిగంట వరకు శాంతియుత ధర్నాను చేపడుతున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలసీదారులకు మెరుగైన సేవలు అందిస్తూ పాలసీ హోల్డర్ తీసుకున్న లోన్ పై వడ్డీ శాతం తగ్గించాలని పాలసీలపై పూర్తిగా జిఎస్టిని రద్దు చేయాలని పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాల కోరారు. వీటితోపాటు ఏజెంట్ల సమస్యలను సైతం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ మారుతీ రాజ్, సాయి శ్రీమంత్, లీయాపి నాయకులు కార్యదర్శి కే శ్రీనివాస్, ట్రెజరీ కరెంటు శ్రీనివాస్, మసూద్, ఏలియా, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: