మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ రెడ్డి సిపిఐ పార్టీ సొసైటీ డైరెక్టర్ ఇరుగు నర్సయ్య.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో అమెర్థ గ్రామంలో అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ రెడ్డి, సిపిఐ పార్టీ సొసైటీ డైరెక్టర్ ఇరుగు నరసయ్య వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి, ఇరుగు నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విప్ రేగా కాంతారావు చేస్తున్న,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారితో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో రేగా గెలుపుకై తమ వంతు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు, గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: