మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తురుమలతండా గ్రామం లో ఇటీవల యాక్సిడెంట్లో చనిపోయిన బానోత్ సందీప్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. అదేవిధంగా అశ్వాపురం మండలం అమెర్థ గ్రామంలో తెరాస పార్టీ యువజన నాయకుడు మేకల దిలీప్ గత కొన్ని రోజుల క్రితం గుండెనొప్పితో చనిపోయరు అనే విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబాన్ని పరామర్శించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 రూపాయలు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు,నాయకులు,కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: