మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, అక్షరానికి విప్లవ రూపం ఇచ్చిన గొప్ప ఘనత కాలోజీ నారాయణరావుది అని,నిజాం కాలంలో జరిగే అన్యాయం గురించి నా గొడవ అనే పుస్తకాన్ని రచించి, అన్యాయంపై తిరుగుబాటు చేసే విధంగా ప్రజానీకాన్ని ఆలోచింపచేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీలు, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: