మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన గంగపుత్రులు పినపాక తాసిల్దార్ విక్రమ్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో అనేక ఆటుపోట్లకి ఎదుర్కొని తమ పడవలను ప్రభుత్వ యంత్రాంగం వరద బాధితుల తరలింపునకు వినియోగించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని తక్షణమే ప్రభుత్వం తమను ఆర్ధికంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల జాలర్లు పోతాబత్తుల జయరాజు, పోతాబత్తుల మహేష్, రామకృష్ణ, రమణ, సాయిరాం, పొసయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: