మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: మండల పరిధిలో మద్దుకూరు గ్రామంలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ నిర్మల జ్యోతి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణులకు పూలు, పండ్లు, గాజులు, పెట్టి శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దుకూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బుచ్చయ్య , బాలకృష్ణ, గర్భిణీలకు స్టీల్ బాక్స్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కే రాణి, ఏఎన్ఎం సుశీల, భవాని, ఆశా వర్కర్లు వెంకటమ్మ, రాములమ్మ, అంగన్వాడీ టీచర్లు శోభారాణి, అనిత, విజయ, సుభాషిని, జయ, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: