మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా, మంగపేట మండలం,తిమ్మంపేట గ్రామం లోని 2002 పదవ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక శుక్రవారం విద్యార్థుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు ఒకరికొకరు యోగ క్షేమాలు తెలుసుకొని రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా మా మిత్రులందరిని చూసే భాగ్యం కలిగింది, ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుల బృందం పావని వెంకన్న, లక్ష్మణ్, హమీద్, రామనాథం,గ్రామ పెద్దలు పూజారి సురేందర్, దిడ్డి కాశీనాధం, సుధాకర్,దంబోతుల చంద్రం, విద్యార్థినీ విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: