మన్యం మనుగడ, మణుగూరు:
తెలంగాణ రాజ్ భవన్ నీ గవర్నర తమిళ్ సై సౌందర్య రాజనతమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగాకాంతారావు విమర్శించారు. తెలంగాణ మంత్రుల పట్ల ఎమ్మెల్యేల పట్ల ఎమ్మెల్సీల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు భిన్నంగా వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. రాజకీయాలు చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా పొందిన తమ గవర్నర్ పదవికి తక్షణమే రాజీనామా చేసి రాజకీయాల్లో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. రాజ్యాంగబద్ధంగా పొందిన గవర్నర్ పదవిలో కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని ఆయన అన్నారు. అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా గవర్నర్ రాజభవన్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలకు వేదిక చేయటం సరికాదని ఆయన అన్నారు.
Post A Comment: