మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం బ్రాహ్మణ పల్లి గ్రామానికి చెందిన బడే కృష్ణ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ లో చేరటం జరిగింది. ఈ సందర్బంగా బడేకృష్ణ మాట్లాడుతూ బీఎస్పీ లాంటి పార్టీ కి రాష్ట్ర నాయకత్వం చేపట్టిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సారద్యం వహించి బీఎస్పీ పార్టీ ని ప్రజల సమస్యలపై గళం విప్పి ధైర్యం గా ప్రధాన పార్టీ లతో సమానం గా ముందుకు దూసుకు వెళ్తున్న ప్రజల పార్టీ బీఎస్పీ, అటువంటి పార్టీ లో ఒక కార్యకర్తగా చేరటం నా అదృష్టం, నాకు ఎంత రాజకీయ ప్రస్థానం ఉన్న కానీ ఒక సామాన్య కార్య కర్తగా పని చేస్తాను.బి ఎస్పీ పార్టీ డా :ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఉన్నత భావాలు, లక్ష్యం నచ్చి ఈ పార్టీ లో చేరాను. పార్టీ కోసం రాష్ట్ర అధినేత ఆదేశాల మేరకు అహర్నిశలు శ్రమిస్తాను పార్టీ ని ప్రజల వద్దకు చేరుస్తాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలా తోడు ఉంటాను, బీఎస్పీ పార్టీ విజయానికి సర్వశక్తుల కృషి చేస్తాను అని తెలియజేశారు. మన రాష్ట్రంలో ఇప్పటికి బహుజనులకు కూడు,గూడు, వస్త్రానికి నానా అవస్థలు పడుతున్నారు అటువంటి ప్రజలకు కనీసం వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి, ఉచితంగా విద్యను వైద్యం అందించి, విజ్ఞాన వంతులు గా తీర్చి దిద్దాలి అనే ఉన్నతమైన లక్ష్యం తో ఈ పార్టీలో చేరాను. బీఎస్పీ పార్టీ అంటే బహుజనుల పార్టీ అంటే కులాలకు అతీతంగా వెనుకబడిన ప్రజలు 90 శాతం మంది తమ ఉనికి కోసం ఎంత అవస్థలు పడుతున్నారో తెలిసి వారికి ఉన్నతమైన విద్యకోసం, వైద్యం కోసం, ప్రతి వ్యక్తికి, ఇల్లు, లాంటి కనీస సౌకర్యాల కోసం సమస్యలపై పోరాటం చేస్తాం ప్రతి ఒక్కరూ సహకరించి బిఎస్పీ పార్టీని అధికారం లోకి తీసుకొని రావాలని కోరారు.
Post A Comment: