మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 56 వ రోజుకు చేరుకుంది. ఈనెల 18 నుండి వ తారీకుల మధ్య ఐటి శాఖా మంత్రి కేటీఆర్ రాష్ట్ర వీఆర్ఏ నాయకులతో చర్చలు జరిపి జీ.ఓ లు జారీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.అటువంటి హామీలు ఇంతవరకు అమలు కాలేదు,ఒకవేళ జీ .ఓ వీ ఆర్ ఏ లకు అనుకూలంగా రాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తూ సమ్మెను 56 వ రోజు కూడా కొనసాగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహమూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొనడం జరిగినది.
Post A Comment: