CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి కెసిఆర్ సంచల నిర్ణయంతో కంగుతిన్న విపక్షాలు : ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాములు

Share it:


గుండాల సెప్టెంబర్ 15(మన్యం మనుగడ) :


తెలంగాణ సెక్రటేరియట్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతో రాష్ట్రంలోని విపక్ష పార్టీలు కంగుతిన్నాయని ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నిట్ట రాములు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడు అనడానికి ఇదొక పెద్ద నిదర్శనం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులను ఉన్నత స్థానంలో నిలిపేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఈ నిర్ణయంతో దళితుల లో ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతాయని దళితుల గుండెల్లో ముఖ్యమంత్రి నిలిచిపోతారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం పట్ల దళిత సంఘాలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి కెసిఆర్ కు రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: