మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పోషణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు, చంటి బిడ్డ తల్లులకు పౌష్టికాహారంతో కూడిన ఆహార నియమాల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అంగన్వాడీ కార్యకర్తలు వివరించడం జరిగింది. పౌష్టికాహారం తీసుకోవడం వలన పుట్టబోయే బిడ్డకు, ఎదుగుతున్న పిల్లలకు జరిగే ఆరోగ్య లాభాల గురించి వివరించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం లాభాల గురించి, దానిలోని పోషక పదార్థాల గురించి వివరించారు. ప్రతి ఒక తల్లి, గర్భిణీ స్త్రీలు తప్పక ఈ ఆహార నియమాలను పాటించాలని, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందాపురం అంగన్వాడీ కార్యకర్త సుజాత, ఉలవచెలక అంగన్వాడీ కార్యకర్త శాంతి ప్రియ, సీతంపేట అంగన్వాడీ కార్యకర్త సౌందర్య ,టేకులగూడెం అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ, ఆయా గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: