మన్యం మనుగడ, కరకగూడెం: నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దారు ఉషా శారదకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు మాట్లాడుతూ సామాన్య, పేద, మధ్యతరగతి,కుటుంబాలపై అధిక బారాలు మోపుతు ప్రజావ్యతిరేక విధానాలను బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మండల కేంద్రంలోని ఆందోళన కార్యక్రమం నిర్వహించి అనంతరం తహశీల్దారు కి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ప్రజల అత్యవసర ధరలను తక్షణమే తగ్గించి ధరల నియంత్రణ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు చర్ప.సత్యం,ఊకే నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: