మన్యం మనుగడ, మంగపేట.
తెలంగాణా రాష్ట్రం లో అతి ముఖ్యమైన పండుగ దసరా.
దసరా పండుగ సందర్బంగా తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణి శుక్రవారం మంగపేట గ్రామం లో మండల తహసీల్దార్ వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తోట రమేష్ చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా మండలం తహసీల్దార్ వై శ్రీనివాస్,సహకార సంఘం చైర్మన్ తోట రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం, తెలంగాణా ఆడపడుచుల కోసం ఈ సంవత్సరం 1 కోటి 10 లక్షల చీరలు తయారు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా పండుగకు ముందే పంపిణి చేయడం ప్రారంభించారు.17 రంగులు,17 డిజైన్లతో మొత్తం 289 రంగులతో బతుకమ్మ చీరలు రూపొందించటం జరిగింది, తెలంగాణా ఆడపడుచులకు తెలంగాణా ప్రభుత్వం తరపున ఇచ్చే దసరా కానుక అన్ని గ్రామాల్లో మొదలు అయిందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిఓ శ్రీనివాస్, నాయక్ తహసీల్దార్ మల్లేశ్వరరావు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: