గుండాల, సెప్టెంబర్ 23(మన్యం మనుగడ) :ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులు ఈనెల 25వ తారీకు నుండి భద్రాచలం శిశు మందిర్లో జరిగే శిక్షణ తరగతుల్లో పాల్గొనాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు పోలు రమేష్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు,వ్యాపారస్తులు , గ్రామస్తులు ఎవరైనా సరే 14 సంవత్సరాలు పైబడిన యువకులు పాల్గొనాలన్నారు. ఇది ప్రధానంగా వ్యక్తిత్వ వికాస శిబిరం దీంట్లో నియుద్ధ అనగా కరాటే కర్ర సాము దేశభక్తి సంబందించిన విషయాలు భౌతిక సంబంధించిన విషయాలు ఉపన్యాసం అదేవిధంగా ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి దాంతోపాటుగా టైం మేనేజ్మెంట్ అదేవిధంగా క్రమశిక్షణ పెద్దలపట్ట పట్ల ప్రేమ ప్రాపంచిక విషయాలు సమాజంలో సేవ చేసే యొక్క గుణాన్ని అలవర్చుకోవడం ఒక వ్యక్తి ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఇట్లాంటి శిక్ష ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధీరజ్ ,ప్రవక్ మోహన్, వెంకటనారాయణ, మానాల సతీష్ , దడికల శ్రీను, మానాల ఉపేందర్, జబ్బ పోతయ్య తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: