మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్లాపురం ఆదివాసీ గ్రామాన్ని మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు సందర్శించి, వైద్య శిబిరం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో మావోయిస్టులు ఉనికి కోల్పోతున్నారని వారికి ప్రజాదరణ లేకుండా పోయిందని వారికి ఎటువంటి పరిస్థితుల్లో సహకరించొద్దని, సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఆయన వెంట ఈడుల్లా బయ్యారం సీఐ రాజగోపాల్ , అశ్వాపురం సిఐ శ్రీనివాస్, ఏడూళ్ళ బయ్యారం ఎస్సై టీ.వీ.ఆర్ సూరి ఉన్నారు.
Post A Comment: