మన్యం మనుగడ కరకగూడెం: అనారోగ్యాలపాలయై దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.
మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రఘనాథపాలెం గ్రామ పంచాయతీకి చెందిన దుర్గం గణేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.28 వేల విలువ గల చెక్కును బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం ఉప సర్పంచు రావుల రవి,మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ గాందర్ల సతీష్ కుమార్,సెక్రటరీ సిద్ధి సునీల్ కుమార్,యువజన నాయకులు విశ్వనాథం,లాలయ్య,శ్రీను,నగేంద్రబాబు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: