CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫాం పంపిణి చేసిన ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట లోని స్థానిక ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత యూనిఫాం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్ధుల ఉన్నాత విద్య కొరకు ఎంతో కృషి చేస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత విద్యను నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను  ప్రవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని, అలాగే మన ఊరు మన బడి కార్యక్రమం పేరుతో ఈ ఒక్క ప్రతి పాఠశాలను నూతనంగా ముస్తాబు చేస్తున్నారని, అలాగే మన ఈ పాఠశాలకు 22 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపిస్తుందని, ఈ సంధర్బంగా తెలియజేశారు. అలాగే వారూ కూడ ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని అలాగే మన దేశంలోనే ఎంతో గొప్ప గొప్ప విజయాలు సాధించిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వా పాఠశాలలోనే చదువుకున్నారని, కుల మత బేధాలు లేకుండా అందరూ సమానమే అని చాటిచెప్పటానికే ఈ ఏకరూప దుస్తులు అనీ, పాటశాలలో  అలాగే ఈ సారీ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందజేస్తానని, మంచి మార్కులు సాధించి, అశ్వారావుపేట మండలానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్ అట్టం రమ్య, ఎస్ఎంసీ చైర్మన్, ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు నరసింహ రావు, పాఠశాల ఉపాధ్యాయులు బాలస్వామి, రాంబాబు, సుభవాని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: